అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో హీరో యిన్లుగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటించిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా పై జీ 5 సరదా పోస్ట్ పెట్టింది. “ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాం” అని పోస్ట్ పెట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీపై త్వరలోనే అధి కారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. తొలుత అనుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2వ వారంలో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీ సుకురావాల్సి ఉంది. అయితే దీనికి ఊహించని స్పందన రావడంతో ఓటీటీ తేదీలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.