Rashmika Mandanna : గోల్డెన్ టెంపుల్లో శ్రీవల్లి పూజలు

Update: 2025-02-11 17:15 GMT

నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తన తాజా సినిమా 'ఛావా' ప్రమోషన్లో బిజీగా ఉంది. బాలీవుడ్ విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో 'ఛావా' బృందం అమృత్ సర్ లోని స్వర్ణదేవా లయంలో సందడి చేసింది. గోల్డెన్డెంపుల్ లో భక్తి శ్రద్ధలతో కనిపించిన రష్మిక, విక్కీ కౌశల్అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్కీ వైట్ కుర్తాలో, రష్మిక పింక్ సూట్ లో కనిపించి అభిమానుల్లో జోష్ నింపారు. ప్రస్తుతం వీరి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ రూపొందిన 'ఛావా' ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని సన్నివేశాల్లోని పదాల్లో మార్పులు చేయాలని బోర్డు తెలిపింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక కనిపించనుంది.

Tags:    

Similar News