మరోసారి నోరు జారిన తాప్సి.. నెటిజన్స్ ట్రోలింగ్

ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదేనేమో.. తనని నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సౌత్ ఇండస్ట్రీపై పలు సార్లు కామెంట్లు చేసి నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతోంది తాప్సీ పన్ను.

Update: 2023-04-19 06:14 GMT

ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం అంటే ఇదేనేమో.. తనని నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సౌత్ ఇండస్ట్రీపై పలు సార్లు కామెంట్లు చేసి నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతోంది తాప్సీ పన్ను. అయినా మళ్లీ అవే కామెంట్లు.. ఈ సారి ఘాటుగానే ఇచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇక్కడ నటిగా ప్రూవ్ చేసుకున్నాకే అక్కడ ఆఫర్లు వచ్చాయి ఆవిషయం మర్చిపోయావా అని ఓ రేంజ్‌లో వేసుకుంటున్నారు. మరి ఇప్పటికైనా నోటికి వచ్చినట్లు మాట్లాడడం మానేసి చేసే సినిమాలపై దృష్టి పెడితే బావుంటుందేమో. లేకపోతే నార్త్ వాళ్లు కూడా గెంటేసే ఛాన్స్ ఉంటుంది. ఎవరి టైమ్ ఎలా ఉంటుందో ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. అవకాశాలు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది.

కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ సినిమాతోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తాప్సీ మంచు మనోజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ సమయంలో పలు తెలుగు సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ మహిళా సెంట్రిక్ పాత్రలు చేయడం ప్రారంభించి తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. అప్పుడు ఆమె సౌత్ సినిమాల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడం గురించి వివరిస్తూ ఆమె తన మొదటి చిత్ర దర్శకుడు రాఘవేంద్రరావును కూడా తక్కువ చేసి మాట్లాడింది. దీంతో అప్పట్లో ఆమె చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది.

తాజాగా మరోసారి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాలతో తొలిసారిగా నటిగా తెరంగేట్రం చేసినా, దక్షిణాది చిత్రాలతో నటిగా సంతృప్తిని పొందలేకపోయానని చెప్పింది. ఈ కారణంగానే తాను బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యానని చెప్పింది. తన హిందీ చిత్రం పింక్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందని, బాలీవుడ్‌లో తాను చేసిన పాత్రల పట్ల సంతృప్తిగా ఉన్నానని తాప్సీ అన్నారు. ఎవరూ సాధించలేని స్థితికి చేరుకోవడమే తన ధ్యేయమని చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సౌత్ ఫిల్మ్ సర్కిల్స్‌లో మళ్లీ దుమారం రేపుతున్నాయి.

Similar News