తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా వారికి ప్రభుత్వ పరమైన అవార్డ్ లు ఇవ్వడం మానేశారు. మధ్యలో ఏపి ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన వాటిపై విమర్శలు వచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’పేరుతో అవార్డులు మొదలుపెట్టింది. 2024 కాలానికి అన్ని అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం తాము ముందే చెప్పినట్టుగా 2014 నుంచి 2023 వరకూ మొత్తం 30 సినిమాలకు అవార్డ్ లను ప్రకటించింది. అయితే ఈ కాలంలో అన్ని విభాగాలను పరిగణలోకి తీసుకోలేదు. కేవలం మూడు ఉత్తమ చిత్రాలను మాత్రమే ఎంపిక చేసింది. 2014 మంచి 2023 వరకు ఎంపికైన ప్రతీ చిత్రానికి నాలుగు రంగాలు హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత లకు అవార్డులు అందించనున్నట్టు ప్రకటించారు.
వీటితో పాటు ఆరు విభాగాల్లో స్పెషల్ అవార్డ్స్ ను కూడా ప్రకటించారు. మరి ఈ పదేళ్లలో ఎంపికైన ఉత్తమ చిత్రాల జాబితా ఇదే.
2014
రన్ రాజా రన్ ,
పాఠశాల,
అల్లుడు శీను
2015
రుద్రమ్మ దేవి,
కంచె ,
శ్రీమంతుడు
2016
శతమానం భవతి,
పెళ్లి చూపులు,
జనతా గ్యారేజ్
2017
బాహుబలి 2 ,
ఫిదా ,
ఘాజీ
2018
మహానటి,
రంగస్థలం ,
కేరాఫ్ కంచరపాలెం
2019
మహర్షి,
జెర్సీ,
మల్లేశం
2020
అల వైకుంఠపురంలో,
కలర్ ఫోటో,
మిడిల్ క్లాస్ మెలడీస్
2021,
RRR,
అఖండ,
ఉప్పెన
2022
సీతారామం,
కార్తీకేయ 2 ,
మేజర్
2023
బలగం,
హనుమాన్,
భగవంత్ కేసరి
ఇక స్పెషల్ కేటగిరీస్ లో
ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ - నందమూరి బాలకృష్ణ
పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ - మణిరత్నం
బిఎన్ రెడ్డి ఫిల్మ్ ఫిల్మ్ అవార్డ్ - సుకుమార్
నాగిరెడ్డి– చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ - అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావ్ ఫిల్మ్ అవార్డ్ - విజయ దేవర కొండ
రఘపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్ - యండమూరి వీరేంద్రనాథ్ లను ఎంపిక చేసింది జ్యూరీ. విజేతలందరికీ జూన్ 14న హైటెక్స్లో అవార్డుల ప్రదానం చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది ప్రభుత్వం.