Madharaasi Actress: 'మధరాసి' నటి.. 2007 ఉరి మిషన్లో అమరుడైన తండ్రి ..
రుక్మిణి వసంత్ పరిశ్రమలో అత్యంత ఆరాధించబడే యువ నటీమణులలో ఒకరిగా మారుతోంది. శివకార్తికేయన్ సరసన ఆమె ఇటీవల నటించిన మధరాసి సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రుక్మిణి వసంత్ నటన, అందం ప్రేక్షకులను దగ్గర చేసింది. శివకార్తికేయన్ సరసన ఆమె ఇటీవల నటించిన మధరాసి సినిమాలో నటన ప్రేక్షకుల తో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల మార్కును దాటే దిశగా పయనిస్తోంది.
రక్షిత్ శెట్టితో కలిసి సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ మరియు సైడ్ బి చిత్రాలలో తన నటన ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇటీవల, ఆమె ఒక కార్యక్రమంలో తన తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ గురించి మాట్లాడారు.
2007 ఉరి మిషన్లో రుక్మిణి వసంత్ తన తండ్రిని కోల్పోయింది
డిసెంబర్ 10, 1997న బెంగళూరులో జన్మించిన రుక్మిణి, 2007లో దేశం కోసం త్యాగం చేసిన కల్నల్ వసంత్ వేణుగోపాల్ కుమార్తె. జమ్మూ కాశ్మీర్లోని ఉరిలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు దాటకుండా చొరబాటుదారులను నిరోధించే ప్రయత్నంలో ఆయన అమరులయ్యారు. భారతదేశపు అత్యున్నత సైనిక గౌరవం అయిన అశోక చక్రను మరణానంతరం అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.
ఈ విషాదకరమైన నష్టం రుక్మిణి జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించింది. తన తల్లి దుఃఖాన్ని అధిగమించి ఇతరులకు సహాయం చేయడం తనపైపై శక్తివంతమైన ముద్ర వేసిందని తెలిపింది.
రుక్మిణి ఒకప్పుడు ఆర్మీ కంటోన్మెంట్లలో, ముఖ్యంగా తమిళనాడులోని వెల్లింగ్టన్లో పెరిగిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తండ్రి కాశ్మీర్లో పోస్టింగ్ పొందిన తర్వాత, కుటుంబం బెంగళూరుకు మారింది. అప్పట్లో, వారు అతని ఉత్తరాల కోసం,ఫోన్ కాల్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన సంఘటనలను గుర్తు చేసుకుంది.
సైనిక కుటుంబంలో నివసించడం అంటే దానిలో ఉన్న నష్టాల గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవడం. అంకితభావంతో కూడిన కుటుంబ వ్యక్తి అయినప్పటికీ, ఆమె తండ్రి ఎల్లప్పుడూ అన్నింటికంటే ఎక్కువగా ఉద్యోగ నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అదే తనపై, తన సోదరిపై బలమైన ముద్ర వేసిందని తెలిపింది.