టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్ గా, బిజినెస్ మెన్ గా బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే రానా నెంబర్ 1 యారి అనే టాక్ షోతో మెప్పించాడు. తాజాగా రానా మరో కొత్త టాక్ షోతో రాబోతున్నాడు. రానా హోస్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కొత్త షో మొదలుకానుంది. పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి. వాటికి గెస్టులుగా ఆర్జీవీ, రాజమౌళి లాంటి స్టార్స్ వచ్చినట్టు సమాచారం. తాజాగా దీని గురించి అమెజాన్ అధికారిక ప్రకటన ఇచ్చింది. "ది రానా దగ్గుబాటి షో" అనే టైటిల్ తో ఈ కొత్త టాక్ షో రానుంది. నవంబర్ 23 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ షోకి రానానే నిర్మాత. మరి ఈ కొత్త టాక్ షో ది రానా దగ్గుబాటి షో ఎలా ఉంటుందో, సినీ సెలబ్రిటీలు ఎన్ని ఆసక్తికర విషయాలు చెప్తారో చూడాలి.