Urvashi Rautela : స్టేడియంలో 24క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ నటి
24క్యారెట్ల గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్నానన్న ఊర్వశి రౌతేలా
'గ్రేట్ గ్రాండ్ మస్తీ'కి పేరుగాంచిన నటి ఊర్వశి రౌతేలా, చివరిసారిగా తెలుగు చిత్రం 'ఏజెంట్'లో ప్రత్యేక ప్రదర్శనలో కనిపించింది. ఇటీవల ప్రస్తుతం జరుగుతున్న ICC ప్రపంచకప్లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన హై-వోల్టేజ్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లో తన మొబైల్ ఫోన్ను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్టేడియంలో తన 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐఫోన్ ను పోగొట్టుకున్నట్లు ఆమె పంచుకుంది.
ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా గెలిచింది., కానీ ఊర్వశి మాత్రం మ్యాచ్ జరిగిన గంటల తర్వాత బాధలో కూరుకుపోయింది. అక్టోబర్ 15న తెల్లవారుజామున 1 గంటలకు పోలీసులకు అధికారిక ఫిర్యాదును నమోదు చేసింది. ఆదివారం మధ్యాహ్నం, ఆమె తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్టుతో నెటిజన్ల నుండి సహాయం కోరుతూ ఒక ట్వీట్ను ఉంచింది. ఆమె పోగొట్టుకున్న ఫోన్ ఫిర్యాదుకు సంబంధించిన అధికారిక పత్రం చిత్రాన్ని కూడా జత చేసింది.
ఈ దురదృష్టకర సంఘటనను వివరిస్తూ, “అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నా 24 క్యారెట్ల నిజమైన బంగారు ఐఫోన్ను పోగొట్టుకున్నాను. ఎవరికైనా అది దొరికితే దయచేసి సహాయం చేయండి. వీలైనంత తొందరగా నన్ను సంప్రదించండి" అని కోరింది.
ఊర్వశి రౌతేలా చేసిన ఈ పోస్టుపై చాలా మంది నెటిజన్లు కామెంట్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్వీట్ కింద అనేక ప్రతిస్పందనలను ఉంచారు. కొందరు ఆమెపై ఎగతాళి చేయగా, మరికొందరు మాత్రం ఆమె ఫోన్ కోల్పోవడంపై సానుభూతిని వ్యక్తం చేస్తూ.. ఆమె మద్దతుగా నిలిచారు.
📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023
Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba