'కొండపొలం'నుంచి ఓబులమ్మా సాంగ్ వచ్చేసింది..!
Kondapollam: వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' సినిమా రూపొందుతుంది.;
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్(Vaisshnav Tej) హీరోగా చేసిన తొలి చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఊహించిన దాని కంటే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా విజయంతో వైష్ణవ్ తేజ్ నటనలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' సినిమా రూపొందుతుంది. వైష్ణవ్ తేజ్కు జంటగా రకుల్ ప్రీత్సింగ్ నటిస్తుంది. ఇటీవలే చిత్రబృందం ప్రకటించిన ఫస్ట్లుక్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి విశేషణ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఫస్ట్సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు.
అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితం, వారి కష్ట సుఖాలు తెలియజేస్తూ గతంలో వచ్చిన ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కిస్తున్నట్లు క్రిష్ ఓ సందర్భంలో చెప్పారు. ఇందులో రకుల్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని పాట విషయానికి వస్తే.. ఈ సాంగ్లో ప్రేమికులుగా వైష్ణవ్-రకుల్ మధ్య కెమిస్ట్రీ బాగా పడింది. ఓ..ఓ ఓబులమ్మా.. బుట్ట చెండు ఆటలో నా పూల కొమ్మా' అంటూ సాగే ఈ పాట సంగీత ప్రీయులను ఆకట్టుకుంటోంది. గొర్రెల కాపరిగా వైష్ణవ్ తేజ్.. రకుల్ ఊహించుకుంటూ ఈ పాట పాడుతుంటే.. ఇక లంగావోణిలో రకుల్ రోలు తప్పితూ ఈ పాటలో గొంతు కలిపింది.ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ, చంద్రబోస్లు ఈ పాటకు సాహిత్యం అందించారు. గాయకులు సత్య యామిణి, పీవీఎన్ఎస్ రోహిత్లు ఆలపించారు. విభిన్నమైన కథాంశంతో ఈ 'కొండపొలం' (KONDAPOLAM)తెరకెక్కుతుంది. అక్టోబర్ 8న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.