Sai Pallavi : ఆ సీన్ కోసం సాయిపల్లవి అన్నం తినడం మానేసింది : వేణు ఉడుగుల

Sai Pallavi : షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన విరాటపర్వం మూవీ ఎట్టకేలకు జూలై 1న థియేటర్లలోకి రానుంది.

Update: 2022-05-30 05:30 GMT

Sai Pallavi : షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయిన కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన విరాటపర్వం మూవీ ఎట్టకేలకు జూలై 1న థియేటర్లలోకి రానుంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ మూవీకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో కనిపంచనుండగా, అతని ప్రేమ కోసం అడవి బాట పట్టిన వెన్నెల పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ.. హీరోయిన్ సాయిపల్లవి పైన ప్రశంసలు కురిపించాడు.. ఆమె ఓ అసాధారణమైన నటి అని పేర్కొన్నాడు.. లుక్స్, నటన పరంగా పాత్రలో ఒదిగిపోయిందని, అంకితభావంతో పనిచేస్తుందని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ కీలకమైన సన్నివేశం కోసం సాయిపల్లవి ఒక్కరోజు భోజనం కూడా చేయలేదని, ఆమె డెడికేషన్ అలాంటిది అని చెప్పుకొచ్చాడు.

కాగా డి సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జరీనా వహాబ్, ఈశ్వరీ రావు, రాహుల్ రామకృష్ణ, దేవి ప్రసాద్, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, సాయి చంద్, బెనర్జీ, నాగినీడు, ఆనంద్ రవి మరియు ఆనంద్ చక్రపాణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News