జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఓ లోయలో పడింది. ఈ ఘటనలో పది మరణించగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు

Update: 2023-05-30 09:15 GMT

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఓ లోయలో పడింది. ఈ ఘటనలో పది మరణించగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వద్ద కత్రా వెళుతున్న బస్సు లోయలో పడటంతో ..10మంది మృతి చెందారు. మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఝజ్జర్ కోట్లి సమీపంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మానస మాతా ఆలయంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఆలయానికి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో జరిగింది. ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని అధికారులు సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నారు. రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ వెంటనే ఉదయపూర్వతిలోని సిహెచ్‌సీకి వచ్చి ప్రమాదం గురించి ఆరా తీశారు.

Tags:    

Similar News