Mancherial: కన్నతండ్రే హంతకుడు.. 11 నెలల బాబును దారుణంగా హత్య..

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది.

Update: 2022-04-25 15:45 GMT

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కన్నతండ్రే 11 నెలల బాబును నేలకేసి కొట్టి చంపేశాడు. తన భార్యపై అనుమానం పెంచుకుని.. ఆ కారణంతో చిన్నారి శ్రీకాంత్‌ ప్రాణం తీశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలో జరిగింది. భార్య జ్యోతిపై అనుమానంతో కొన్నాళ్లుగా గొడవ పడుతున్న నరేష్‌.. ఆమెపై భౌతిక దాడికి దిగాడు.

పలుమార్లు దారుణంగా కొట్టాడు. ఆ కోపంలోనే తల్లి చేతిలో ఉన్న బిడ్డను బలవంతంగా లాక్కుని, ఈడ్చి నేలకేసి కొట్టి చంపేశాడు. ఏం జరుగుతుందో ఆ తల్లి గమనించి అప్రమత్తం అయ్యేలోపే క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ఈ అరాచకం అంతా సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. పసిబిడ్డ పరిస్థితి చూసి ఆ తల్లి గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా.. దాడి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు నరేష్‌. 

Tags:    

Similar News