Mancherial: హత్య కేసులో ఇరికించాలని చూసిన పోలీసులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం..
Mancherial: పోలీసుల వేధింపులతో ఓ యువకుడు సెల్ఫీ వీడియా చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Mancherial: పోలీసుల వేధింపులతో ఓ యువకుడు సెల్ఫీ వీడియా చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. తనను ఓ హత్యకేసులో అక్రమంగా ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన క్యాబ్ డ్రైవర్ సాగర్ విషం తాగాడు. వెంటనే అతన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గత నెలలో మహేష్ అనే యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు తాండూర్ సీఐ జగదీష్, ఎస్సై కిరణ్కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ సీపీకి సాగర్ వాట్సప్ చేశాడు. కేవలం ఒక ఫన్నీ వీడియో ఆధారంగా తనపై కేసు నమోదు చేయాలని చూస్తున్నారని సెల్ఫీ వీడియాలో తెలిపాడు.