CBN: టీడీపీ ఎంపీపై డ్రగ్స్ ఆరోపణలు.. చంద్రబాబు సీరియస్

పూర్తి నివేదిక ఇవ్వాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడికి ఆదేశం

Update: 2026-03-15 13:30 GMT

మొ­యి­నా­బా­ద్‌ డ్ర­గ్స్‌ కే­సు­లో ఏలూ­రు ఎంపీ పు­ట్టా మహే­శ్‌ పట్టు­బ­డిన అం­శం­పై ని­వే­దిక ఇవ్వా­ల­ని ఏపీ సీఎం చం­ద్ర­బా­బు.. తె­దే­పా రా­ష్ట్ర అధ్య­క్షు­డు పల్లా శ్రీ­ని­వా­స­రా­వు­ను ఆదే­శిం­చా­రు. పు­ట్టా మహే­శ్‌­పై వచ్చిన ఆరో­ప­ణ­ల­ను సీఎం సీ­రి­య­స్‌­గా తీ­సు­కు­న్నా­రు. పా­ర్టీ కా­ర్య­క్ర­మా­ల­కు దూ­రం­గా ఉం­డా­ల­ని ఇప్ప­టి­కే ఆయ­న్ను అధి­ష్ఠా­నం ఆదే­శిం­చిం­ది. ఈ ఘట­న­పై మహే­శ్‌­కు నో­టీ­సు­లు ఇవ్వా­ల­ని పల్లా శ్రీ­ని­వా­స­రా­వు­ను చం­ద్ర­బా­బు ఆదే­శిం­చా­రు. డ్ర­గ్స్‌ వంటి ఘట­న­ల్లో ఎవ­రు­న్నా ఉపే­క్షిం­చే­ది లే­ద­న్నా­రు. వ్య­క్తు­లు, నేతల బల­హీ­న­త­లు, తప్పు­ల­కు పా­ర్టీ నష్ట­పో­యే పరి­స్థి­తి రా­ని­వ్వొ­ద్ద­ని చె­ప్పా­రు. మొ­యి­నా­బా­ద్‌ డ్ర­గ్స్‌ కే­సు­లో ఆరు­గు­రి­కి పా­జి­టి­వ్‌ వచ్చిం­ది. మాజీ ఎమ్మె­ల్యే పై­ల­ట్‌ రో­హి­త్‌­రె­డ్డి, ఏలూ­రు ఎంపీ పు­ట్టా మహే­శ్‌­తో­పా­టు రి­తే­శ్‌­రె­డ్డి, నమి­త్‌, కౌ­శి­క్‌ రవి, అర్జు­న్‌­రె­డ్డి­ల­కు పా­జి­టి­వ్‌ వచ్చిం­ది. 

ఎంపీ పుట్టా మహేశ్‌కు స్టేషన్‌ బెయిల్‌

మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి అనంతరం విడుదల చేశారు. మొ­యి­నా­బా­ద్ పరి­ధి­లో వె­లు­గు­లో­కి వచ్చిన డ్ర­గ్స్ కే­సు­లో పలు­వు­రి­పై పరీ­క్ష­లు ని­ర్వ­హిం­చి­న­ట్లు అధి­కా­రు­లు తె­లి­పా­రు. ఈగల్ బృం­దం ఎస్పీ గి­రి­ధ­ర్ ఆది­వా­రం ఉదయం మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ కీలక వి­వ­రా­లు వె­ల్ల­డిం­చా­రు. మొ­త్తం ఆరు­గు­రి­కి డ్ర­గ్స్ పరీ­క్ష­ల్లో పా­జి­టి­వ్ వచ్చి­న­ట్లు ఆయన చె­ప్పా­రు. మాజీ ఎమ్మె­ల్యే పై­ల­ట్ రో­హి­త్ రె­డ్డి, ఏలూ­రు ఎంపీ పు­ట్టా మహే­శ్ కు­మా­ర్‌­తో పాటు రి­తే­శ్ రె­డ్డి, నమి­త్, కౌ­శి­క్ రవి, అర్జు­న్ రె­డ్డి­ల­కు పరీ­క్ష­ల్లో పా­జి­టి­వ్ వచ్చి­న­ట్లు తె­లి­పా­రు.

 శని­వా­రం రా­త్రి ని­ర్వ­హిం­చిన ర్యా­పి­డ్ టె­స్ట్‌­లో ఎంపీ పు­ట్టా మహే­శ్ కు­మా­ర్‌­కు నె­గి­టి­వ్ వచ్చి­న­ట్లు పో­లీ­సు­లు వె­ల్ల­డిం­చా­రు. కానీ అనం­త­రం ని­ర్వ­హిం­చిన రక్త పరీ­క్ష­లో మా­త్రం డ్ర­గ్స్ వి­ని­యో­గం ఉన్న­ట్లు పా­జి­టి­వ్ రి­పో­ర్ట్ వచ్చి­న­ట్లు ఎస్పీ గి­రి­ధ­ర్ పే­ర్కొ­న్నా­రు. ఈ నే­ప­థ్యం­లో వి­చా­ర­ణ­లో భా­గం­గా మహే­శ్ కు­మా­ర్‌­ను పో­లీ­సు­లు ప్ర­శ్నిం­చి, చట్ట­ప­ర­మైన ప్ర­క్రి­య­లో భా­గం­గా స్టే­ష­న్ బె­యి­ల్ మం­జూ­రు చే­సి­న­ట్లు తె­లి­పా­రు. మరింత సమా­చా­రం సే­క­రిం­చేం­దు­కు పో­లీ­సు­లు దర్యా­ప్తు కొ­న­సా­గి­స్తు­న్న­ట్లు చె­ప్పా­రు. డ్ర­గ్స్ వి­ని­యో­గం మరి­యు సర­ఫ­రా కో­ణా­ల్లో కూడా వి­చా­రణ సా­గు­తు­న్న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. పా­ర్టీ­లో డ్ర­గ్స్‌ తీ­సు­కు­న్న­ట్లు అం­గీ­క­రిం­చి­న­ట్లు పో­లీ­సు­లు తె­లి­పా­రు. నిం­ది­తు­ల­పై BNS 109తో­పా­టు ఆర్మ్స్‌ యా­క్ట్‌..కేసు నమో­దు చే­శా­రు.

Tags:    

Similar News