Selfie Suicide : యువతి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య..!
Selfie Suicide : యువతి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Selfie Suicide : యువతి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుండి భారీగా డబ్బులు, బంగారం తీసుకొని ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటుందని.. మోసం చేసినందుకే చనిపోతున్నాననంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కొప్పిశెట్టి శంకరరావుకు గతంలో వివాహమైనట్లు తెలుస్తోంది. అయితే.. భార్యాభర్తలు విడిపోయినట్లు సమాచారం.