కడపలో దారుణ హత్య

Update: 2023-06-23 08:00 GMT

కడపలో దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీనివాసులు రెడ్డిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకుని పరిగెత్తినా శ్రీనివాసులు రెడ్డిని వెంటాడి వేటాడురు. కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాసులు రెడ్డి ప్రాణాలు కోల్పోయారు, కడప సంధ్య సర్కిల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. కడపలో పలు భూకబ్జాలు, వివాదాల కేసులో శ్రీనివాసులు రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. శ్రీనివాసులు రెడ్డి ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు.

Tags:    

Similar News