ప్రైవేట్ పార్ట్స్ లో 960 గ్రాముల బంగారం దాచిన ఎయిర్ హోస్టెస్‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ లో దాచిపెట్టింది.;

Update: 2024-05-31 05:38 GMT

బంగారాన్ని స్మగ్లింగ్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ లో దాచిపెట్టిన ఎయిర్ హోస్టెస్‌ను కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో  అరెస్టు చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) శుక్రవారం తెలిపింది.

సురభి ఖతున్ అనే ఎయిర్ హోస్టెస్ తన పురీషనాళంలో దాదాపు 960 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టింది. ఆమె ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పని చేస్తుంది. మే 28న మస్కట్ నుండి కన్నూర్‌లో దిగిన విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కన్నూర్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సురభి ఖతున్‌ను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

.సురభి ఖాతున్ గతంలో చాలాసార్లు బంగారాన్ని స్మగ్లింగ్ చేసిందని సమాచారం. 

Tags:    

Similar News