ఎస్బీఐ ఏటీఎం మిషన్ను ఎత్తుకెళ్లిన దొంగలు
మరో ఏటీఎంతో పాటు జ్యువెలరీ షాపులో చోరీకి యత్నించారు దొంగలు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఓ ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కలెక్టర్ చౌక్లో చోటుచేసుకుంది. ఎస్బీఐ ఏటీఎం మిషన్లో దాదాపు 30 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దేవిచంద్ చౌక్లోని మరో ఏటీఎం, జ్యువెలరీ షాపులో చోరీకి యత్నించారు దొంగలు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.