Congo : కాంగోలో పడవ ప్రమాదం.. 78 మంది మృతి

Update: 2024-10-05 12:30 GMT

కాంగోలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. కివు లేక్‌​లో 278 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 78 మంది మృతిచెందారు. వంది మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికే 50మంది మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక ప్రావిన్స్​ గవర్నర్ తెలిపారు. ఓవర్​ లోడింగ్​ కారణంగా కిటుకు పోర్టుకు కొన్ని మీటర్ల సమీపంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పడవ మునిగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఓవర్‌ లోడింగుతో ప్రయాణికులను తరలించే పడవలు తరచూ ప్రమాదాలకు గురవటం ఈ ప్రాంతంలో సాధారణంగా మారింది

Tags:    

Similar News