రంగారెడ్డిలో డబుల్ మర్డర్
రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని దుండగులు బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో డబుల్ మర్డర్ సంచలనం సృష్టిస్తోంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్ని దుండగులు బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశారు. మృతుల్లో ఒకరు బ్లాంకెట్లు అమ్ముకునే వ్యక్తి కాగా మరొకరు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వ్యక్తి. కాటేదాన్ ఓల్డ్ కర్నూల్ రోడ్డులో ఈ దారుణం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ రప్పించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది హత్యకు గురైన వ్యక్తులు ఎవరనేది తేలాల్సి ఉంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.