Nizamabad: నిజామాబాద్లో విషాదం.. హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య..
Nizamabad: నిజామాబాద్లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానకి పాల్పడ్డారు.;
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానకి పాల్పడ్డారు. గత 15 రోజులుగా హోటల్లోనే సూర్యప్రకాశ్ కుటుంబం ఉంటోంది. ఫ్యామిలీ మెంబర్స్లో సూర్యప్రకాశ్ ఉరేసుకుని సూసైడ్ చేసుకోగా..మిగితా ముగ్గురు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతులు ఆదిలాబాద్కు చెందిన సూర్యప్రకాశ్, అక్షయ, ప్రత్యుష, అద్వైత్గా గుర్తించారు. కుటుంబమంతా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.