కన్నతండ్రినే కిడ్నాప్‌ చేసిన కొడుకు

ఆస్థి వివాదంతోనే కొడుకు తన తండ్రిని కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Update: 2021-03-03 06:41 GMT

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామంలో ఓ కొడుకు తన కన్నతండ్రినే కిడ్నాప్‌ చేశాడు. ఆస్థి వివాదంతోనే కొడుకు తన తండ్రిని కిడ్నాప్‌ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. భృగుబండ గ్రామానికి చెందిన తవిటి ఆంజనేయులుకు అతని తండ్రి మోహనరావుతో గత కొంత కాలంగా తీవ్ర మనస్పర్ధలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో.. ఆస్థి పంకాలే కిడ్నాప్‌కు ప్రదాన కారణమని తెలుస్తోంది. మరో వైపు.. తన భర్త రామారావుతో పాటు తన తండ్రి మోహనరావును కిరాయి రౌడీలను తీసుకువచ్చి తన సోదుడు ఆంజనేయులే కిడ్నాప్‌ చేశాడని..మోహనరావు కుమార్తె నాగలక్ష్మి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Tags:    

Similar News