Mahabubabad: ప్రియుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్య..

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదం నెలకొంది.

Update: 2022-03-16 04:15 GMT

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదం నెలకొంది. ప్రియుడు పెళ్లిచేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీఆర్‌ఎస్‌ మండల యూత్‌ అధ్యక్షుడైన కొండా లింగమల్లు, అదే గ్రామానికి చెందిన పోలెపల్లి శరణ్య ప్రేమించుకున్నారు. అయితే గడీలో సెటిల్మెంట్‌ చేసి గతంలో ఆమె శీలానికి రెండు లక్షలు వెలకట్టారు గ్రామ పెద్దలు.

అందుకు ఒప్పుకోని యువతి, లింగమల్లుతోనే పెళ్లి చేయాలని భీష్మించింది. దీంతో పెళ్లికి మరో ఆరునెలలు గడువు పెట్టారు పెద్దమనుషులు. మోసం చేసేందుకే మరో ఆరు నెలలు పెళ్లి పొడిగించారని మనస్థాపానికి గురైన యువతి.. సుసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన అనుచరుడిని కాపాడుకునేందుకే గడీలో ఊరిదొర పంచాయితీ పెట్టారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News