Khammam : ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడి దారుణ హత్య..
Khammam : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడిని దారుణంగా హతమార్చారు.
Khammam : ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకుడిని దారుణంగా హతమార్చారు. టేకులపల్లి సొసైటీ డైరెక్టర్గా ఉన్న తమ్మినేని కృష్ణయ్యను దుండగులు కత్తులతో నరికి చంపారు. పొన్నెకల్ రైతు వేదిక వద్ద జాతీయ జెండా ఎగురవేసి, తిరిగి తెల్దారుపల్లి వస్తుండగా.. గ్రామ సమీపంలో దారి కాచి హత్య చేశారు. హతుడు తమ్మినేని కృష్ణయ్య భార్య ఎంపీటీసీగా ఉన్నారు. హంతకులను గుర్తించేందుకు పోలీస్ బృందం రంగంలోకి దిగింది.
మరోవైపు ఈ హత్య నేపథ్యంలో కృష్ణయ్య స్వగ్రామం తెల్దార్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ్మినేని కృష్ణయ్య అనుచరులు.. తమ్మినేని వీరభద్రం ఇంటిని ధ్వంసం చేశారు.