Maharastra: తండ్రి దుర్మార్గం.. నీట్ మాక్ టెస్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయని కూతురిని..

నీట్ మాక్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయని 17 ఏళ్ల కూతురిని కొట్టి చంపేశాడు ధండిరామ్ భోంస్లే.;

Update: 2025-06-24 07:25 GMT

నీట్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునా డాక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ తండ్రి.. కూతురు తన ప్రయత్నం తాను చేస్తున్నా తండ్రి అంచనాలకు చేరుకోలేకపోయింది. దాంతో తండ్రికి కూతురి మీద కోపం పెరిగి పోయింది. నీట్ ఒక్కటే జీవిత పరమావధి అనుకున్నాడు.. కూతురి మాక్ టెస్ట్ మార్కులు చూసి ఇలా అయితే నీట్ పరీక్షలో ర్యాంకు రావడం అటుంచి కనీసం పాసవుతుందని గ్యారెంటీ కూడా కలగలేదు అతడికి దాంతో ఆమెను చావబాదాడు.. మార్కులు కాదు మనిషే లేకుండా పోయింది.

అది కాకపోతే ఇంకొకటి అని కూతురికి ధైర్యం చెప్పాల్సిన తండ్రి విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు.. కన్న కూతురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. అది ఫైనల్ ఎగ్జామ్ కూడా కాదు.. మాక్ టెస్ట్‌ మాత్రమే. అందులో తక్కువ మార్కులు వచ్చాయని 17 ఏళ్ల కూతురిని కొట్టి చంపేశాడు మహారాష్ట్రకు చెందిన ధండిరామ్ భోంస్లే.  కూతురు సాధన 10వ తరగతి బోర్డు పరీక్షలలో 92.60 శాతం మార్కులు సాధించి తండ్రి కళ్లలో ఆనందాన్ని నింపింది. అలాగే నీట్ ఎగ్జామ్ కూడా పాసవుతుంని భావించాడు.. తన కూతురు డాక్టర్ కాబోతోందని కలలు కన్నాడు.. కానీ ఆ కలలు కాస్తా కల్లలు అయ్యాయి. 

మహారాష్ట్రలోని సాంగ్లికి చెందిన సాధన భోంస్లే డాక్టర్ కోర్సు చదివేందుకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ లేదా నీట్ కి సిద్ధమవుతోంది. దాని కోసం మాక్ టెస్ట్ లు రాస్తోంది. ఆమె ప్రాక్టీస్ టెస్ట్ లలో తక్కువ మార్కులు సాధించడంతో, ఆమె తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడు కూడా అయిన ధోండిరామ్ భోంస్లే కోపంగా ఉన్నాడు.

ఆ కోపంతో అతను 17 ఏళ్ల తన కూతురిని కర్రతో పదే పదే కొట్టాడు. ఆ దెబ్బలకు 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. శుక్రవారం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తన కూతురిని కొట్టినట్లు ఒప్పుకున్న తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దాడిలో సాధన భోంస్లే తలకు గాయాలయ్యాయి. ఆమెను సాంగ్లీలోని ఉషకల్ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందేలోపే ఆమె మరణించింది. "జూన్ 22న బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త తక్కువ మార్కులు వచ్చినందుకు ఆమెను కొట్టాడని, ఫలితంగా ఆమె ఆసుపత్రిలో మరణించిందని తెలిపింది. నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జూన్ 24 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. కేసు దర్యాప్తులో ఉంది" అని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News