దారుణం.. బాలికపై కామాంధుడు అత్యాచారంనెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జాకీర్ హుస్సేన్నగర్లో 40 ఏళ్ల కామాంధుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత ఐదు రోజులుగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మున్నా అనే వ్యక్తి ఆ చిన్నారిని తీసుకెళ్తుండగా స్థానికులు గుర్తించారు. అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై దిశ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.