నెల్లూరులోని నాలుగోమైలు.. నవలాకులతోటలో దారుణం జరిగింది. శనివారం అర్థరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నిర్మలమ్మతో పాటు సమీప బంధువు రమణమ్మను భర్త నాగేశ్వరరావు అతికిరాతంగా హత్య చేశాడు. ఈ హత్యలతో ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.