Uttar Pradesh: భార్య గుడ్డు కూర వండలేదని భర్త ఆత్మహత్య..
పని నుండి ఇంటికి వచ్చిన తన కుమారుడు తన భార్యను గుడ్డు కర్రీ వండమని అడిగాడని, ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని శుభమ్ తల్లి పోలీసులకు వివరించింది.
ఉత్తరప్రదేశ్లోని బందాలో 28 ఏళ్ల వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది మృతుడిని శాంతి నగర్ ప్రాంతానికి చెందిన శుభం గా గుర్తించారు. అతను పెయింటింగ్ పని ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. పోలీసులు మరియు కుటుంబ సభ్యుల ప్రకారం, శుభమ్ పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భార్యా భర్తల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ఆత్మహత్యతకు పాల్పడ్డాడు.
ఇంటికి వచ్చిన తర్వాత తన కుమారుడు తన భార్యను గుడ్డు కర్రీ వండమని అడిగాడని, కానీ ఆమె నిరాకరించిందని శుభం తల్లి మున్నీ దేవి పోలీసులకు తెలిపింది.
శుభమ్ బయటి నుండి చౌమీన్ (స్నాక్) తెచ్చాడని, అతని భార్య తినడానికి నిరాకరించిందని మున్నీ దేవి చెప్పారు. కోడలు కూర వండడానికి నిరాకరించడంతో నా కొడుకు గుడ్డు కూరను తానే స్వయంగా వండుకున్నాడు. ఆ తర్వాత, ఇద్దరి మధ్య వాదన చెలరేగింది" అని ఆమె చెప్పింది. ఈ వివాదం తీవ్రమైందని, వాదన జరుగుతుండగా అతడి భార్య వీధిలోకి వెళ్లిపోయింది.
తన కొడుకు, తాను కలిసి ఆమెను వెంబడించి ఇంట్లోకి తిరిగి తీసుకువచ్చామని చెప్పారు. " ఇంటి గొడవ వీధికెక్కిందని, నా కొడుకు మనస్థాపం చెందాడు, తీవ్ర అవమానానికి గురయ్యాడు" అని ఆమె ఆరోపించింది.
పొరుగువారి దృష్టిలో, సమాజం దృష్టిలో తన గౌరవం దెబ్బతిన్నదని భావించాడు. ఆ సమయంలో, శుభం తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తరువాత కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతన్ని రక్షించలేకపోయారు.
తన కోడలు తరచూ గొడవలు రేకెత్తిస్తుందని మున్నీ దేవి ఆరోపించింది. గత ఏడాది ఏప్రిల్లోనే తమ వివాహం జరిగిందని, సంవత్సరం కూడా పూర్తి కాలేదని ఆమె పోలీసులకు తెలిపింది.
"నా కొడుకు భార్య గతంలో కూడా ఇలాగే చేసింది" అని ఆమె పేర్కొంది. శుభమ్ కొన్నిసార్లు మద్యం సేవించేవాడని, దానికి అతని భార్య తీవ్రంగా అభ్యంతరం చెప్పేదని, దీనివల్ల పదే పదే గొడవలు జరిగేవని కూడా ఆమె పేర్కొంది.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపింది. శుభమ్ మరణానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకోవడానికి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.