తిరుమలలో విషాదం.. భారీ వర్షానికి నవవధువు దుర్మరణం...!
వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జ్లోకి భారీగా వర్షం నీరు చేరుకోవడంతో.. ఆ వరద నీటిలో తుఫాన్ వాహనం చిక్కుకుంది.;
తిరుమలలో భారీ వర్షం విషాదం నింపింది. ఓ నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జ్లోకి భారీగా వర్షం నీరు చేరుకోవడంతో.. ఆ వరద నీటిలో తుఫాన్ వాహనం చిక్కుకుంది. ఇందులో కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన ఏడుగురు ప్రయాణికులున్నారు. వరదలో చిక్కుకోవడంతో నవవధువు మృతి చెందింది. మరో చిన్నారి అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.