శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తాపడి విద్యార్ధి మృతి..!
శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో పొన్నాడలోని గ్లోబల్ స్కూల్ బస్సు చెరువులో పడింది.;
శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఎచ్చెర్ల మండలం కొయ్యం గ్రామ సమీపంలో పొన్నాడలోని గ్లోబల్ స్కూల్ బస్సు చెరువులో పడింది. ఈ ప్రమాదంలో బడివానిపేటకు చెందిన మైలపల్లి రాజు అనే విద్యార్ధి బస్సు కింద పడి చనిపోయాడు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 8 మంది విద్యార్ధులు ఉన్నారు. అప్రమత్తమైన స్థానికులు బస్సులోని మిగిలిన విద్యార్ధులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.