Mahabubabad: 4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారయత్నం.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి..

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లాలో ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారయత్నం చేశాడు.

Update: 2022-04-11 14:30 GMT

Mahabubabad: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచార యత్నం చేశాడు. విద్యార్థిని ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య వచ్చి ఈ అఘయిత్యానికి పాల్పడ్డాడు. విద్యార్థిని చెల్లెలు, తమ్ముడి కేకలు వేయడంతో రాజయ్య అక్కడి నుండి పారిపోయాడు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకుని తల్లిదండ్రులు 1098కు సమాచారం ఇచ్చారు. జిల్లా బాల పరిరక్షణ విభాగానికి ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News