కువైట్లో తెలంగాణ మహిళ అదృశ్యం.. 10రోజుల నుంచి ఫోన్ స్విచ్ఆఫ్..!
కువైట్లో తెలంగాణకు చెందిన మహిళ అదృశ్యం మిస్టరీగా మారింది.
కువైట్లో తెలంగాణకు చెందిన మహిళ అదృశ్యం మిస్టరీగా మారింది. ఖమ్మంకు చెందిన ఉషాభాను బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లింది. అక్కడ ఓ అరబ్ షేక్ ఇంట్లో ఉషాభాను పనిచేస్తోంది. అయితే 10 రోజుల నుంచి ఉషాభాను నుంచి ఎలాంటి సమాచారం అందించలేదు.. దీంతో ఇంటి యజమాని షేక్కు ఫోన్ చేస్తే పొంతనలేని సమాధానలు ఇస్తున్నాడని ఉషాభాను పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైన తమ తల్లిని ఇండియాకు తీసుకు రావాలని సీఎం కేసీఆర్ను వేడుకుంటున్నారు.