Srisailam Temple : శ్రీశైలం ఆలయంలో చోరీ.. హుండీ సొమ్మును కాజేసిన ఉద్యోగి..
శ్రీశైలం ఆలయంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. కాంట్రార్ట్ పరిచారక ఉద్యోగి విద్యాధర్ హుండీ సొత్తు కాజేశాడు. స్వామివారి హుండీలో రూ.24,644 నగదును చోరీ చేశాడు. తెల్లవారుజామున విధులకు వచ్చి డబ్బులు ఎత్తుకెళ్లాడు. చోరీ ఘటనను సీసీ కెమెరా దృశ్యాల్లో గుర్తించిన అధికారులు విద్యాధర్ను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దేవుడి హుండీ చేసిన విద్యాధర్పై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి సొమ్మును ఎలా కాజేయాలి అనిపించిందంటూ ఫైర్ అవుతున్నారు.