గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు.. గొడవ జరగడంతో హత్య..
క్షణికావేశం.. చిన్న సమస్యని కూడా పెద్దది చేసుకుంటున్నారు.. కోపం కట్టలు తెచ్చుకుంటోంది. విచక్షణ కోల్పోతున్నారు.. హంతకులుగా మారుతున్నారు.;
క్షణికావేశం.. చిన్న సమస్యని కూడా పెద్దది చేసుకుంటున్నారు.. కోపం కట్టలు తెచ్చుకుంటోంది. విచక్షణ కోల్పోతున్నారు.. హంతకులుగా మారుతున్నారు.
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల మహిళ దక్షిణ గోవాలోని ఒక అడవిలో హత్యకు గురైంది. ఆమె తన ప్రియుడితో కలిసి పెళ్లి చేసుకోవడానికి తీరప్రాంత రాష్ట్రం గోవాకు వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకోవడంతో అతడు ఆమెను చంపినట్లు తెలుస్తోంది.
దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో తన ప్రియురాలిని హత్య చేసిన 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుడిని కర్ణాటకలోని ఉత్తర బెంగళూరు నివాసి సంజయ్ కెవిన్ ఎం గా గుర్తించారు. బాధితురాలు, 22 ఏళ్ల రోష్ని మోసెస్ ఎం కూడా అదే ప్రాంతానికి చెందినవారు. నేరం చేసిన తర్వాత, సంజయ్ బెంగళూరుకు తిరిగి పారిపోయాడని పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం హంతకుడు సంజయ్ ప్రియురాలు రోష్ణిని చంపి మృతదేహాన్ని అడవిలో పడేశాడు" అని పోలీసులు తెలిపారు.
సోమవారం సాయంత్రం దక్షిణ గోవాలోని ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో రోష్ణి మృతదేహం లభ్యం కావడంతో హత్య వెలుగులోకి వచ్చింది. ఆమె గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహం దొరికిన తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం వెలుగులోకి వచ్చిన హంతకుడు సంజయ్ ని 24 గంటల్లోనే బెంగళూరులో పట్టుకుని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.