టీటీడీ అన్యమతస్థ ఉద్యోగులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. టీటీడీ ఏఈవో రాజశేఖర్బాబును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పుత్తూరులో అన్యమత ప్రార్థనల్లో ఆయన పాల్గొనడంతో చర్యలు తీసుకున్నారు. అదే పట్టణానికి చెందిన ఓ భక్తుడు ఫొటోలు, వీడియోలతో టీటీడీ విజిలెన్స్కి ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు.. ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్లినట్లు గుర్తించారు. టీటీడీ ఉద్యోగిగా ఉన్న రాజశేఖర్బాబు సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని.. బాధ్యతారహితంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.