మా చెల్లి మెహందీ కోసమని వెళ్లింది.. అనుమానం వచ్చి నేను గుడికి వెళ్లాను : జయప్రకాష్
విశాఖ జిల్లాలో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్ధినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అయితే తమ సోదరి.. శనివారం సాయంత్రం మెహందీ కోసం బయటికి వెళ్లిందని.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి గుడి దగ్గరకు వెళ్లినట్లు మృతిరాలి సోదరుడు జయప్రకాష్ తెలిపాడు. మొదట తమ చెల్లి కనిపించలేదని, కానీ అఖిల్ కంగారుగా వెళ్లడం చూశానన్నారు. మూడ్రోజుల క్రితం అఖిల్కు, రామ్కు గొడవ జరిగిందని.. రామ్ ఎంట్రీపైనా తనకు అనుమానం ఉందని అన్నాడు.