అయ్యప్ప భక్తులపై కరోనా ప్రభావం!

లక్షలాదిమంది అయ్యప్పలతో కళకళలాడే శబరిమల.. ప్రస్తుతం బోసిపోయంది. ఏటా మకరజ్యోతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు వచ్చేవారు.

Update: 2021-01-13 07:50 GMT

లక్షలాదిమంది అయ్యప్పలతో కళకళలాడే శబరిమల.. ప్రస్తుతం బోసిపోయంది. ఏటా మకరజ్యోతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు వచ్చేవారు. కానీ రేపటి మకరజ్యోతి దర్శనానికి కూడా కేవలం 5 వేల మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. కరోనా కారణంగా స్వాములు కనిపించడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆలయాలు తెరిచినా.. భక్తుల సంఖ్య మాత్రం పూర్తిగా తగ్గిపోయింది. రోజుకు ఐదువేల మందినే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తోంది ట్రావెన్‌కోరు దేవాస్యం బోర్డు. కేవలం ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకున్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.

Tags:    

Similar News