కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన నటి సాయి పల్లవి..
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్తో కలిసి రాబోయే చిత్రం 'రామాయణం'లో కనిపించనున్న నటి సాయి పల్లవి ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించింది.;
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్తో కలిసి 'రామాయణం' చిత్రంలో నటిస్తున్న నటి సాయి పల్లవి ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించింది. కాశీ అన్నపూర్ణ ఆలయాన్ని, గంగా హారతిని కూడా దర్శించుకుని భక్తితో నమస్కరించింది.
ఇటీవల తమిళ చిత్రం అమరన్ లో కనిపించి మరోసారి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.