Cricketer Virender Sehwag : విడాకులు తీసుకోనున్న మాజీ క్రికెటర్ సెహ్వాగ్?

Update: 2025-01-24 10:00 GMT

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. భార్య ఆర్తి అహ్లావత్ నుంచి విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నట్లు తెలిపింది. రెండు వారాల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే వారిలో ఆర్తి ఎక్కడా కనిపించలేదు. 2004లో వీరికి పెళ్లి కాగా, ఇద్దరు కుమారులున్నారు. గత దీపావళి రోజు సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫొటోలు షేర్ చేయడం విడాకుల వార్తకు బలం చేకూరుస్తోంది.

1980 డిసెంబరు 16న జన్మించిన ఆర్తి, లేడీ ఇర్విన్ సెకండరీ స్కూల్ మరియు భారతీయ విద్యాభవన్ నుండి తన విద్యను అభ్యసించింది. ఢిల్లీ యూనివర్సిటీలోని మైత్రేయి కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. సెహ్వాగ్ , ఆమె ప్రేమకథ 2000 సంవత్సరంలో కొనసాగింది. 2004లో, వారిద్దరూ మాజీ ఆర్థిక మంత్రి మరియు ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అంటే DDCA, అరుణ్ జైట్లీ నివాసంలో వివాహం చేసుకున్నారు.

Tags:    

Similar News