మంత్రి జగదీష్రెడ్డి కాన్వాయ్ పై దాడి
మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న ఓఆర్ఆర్ భూ బాధితులు;
యాదాద్రి జిల్లాలో మంత్రి జగదీష్రెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వాయ్ను ఓఆర్ఆర్ భూ బాధితులు అడ్డుకున్నారు. అనంతరం మంత్రి జగదీష్ కాన్వాయ్పై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనలో మంత్రి కాన్వాయ్లోని ఓ కారు సైడ్ గ్లాస్ పగిలింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం హెడ్ లైట్లు సైతం ధ్వంసమయ్యాయి. నిన్న కలెక్టరేట్లో మంత్రి సమీక్ష ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.