ప్రస్తుతం బైక్ ట్యాక్సీ యాప్ సర్వీస్ అందిస్తున్న రాపిడో త్వరలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (ఎన్ఆర్ఎఐ) ద్వారా రెస్టారెంట్లతో భాగ స్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకరించింది. ప్రస్తుతం ఆ రంగంలో సేవలం దిస్తున్న స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ లని భావిస్తుంది. ఆ రెండు సంస్థలు ప్రస్తుతం 16 నుంచి 30 శాతం వరకు కమిషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఆ కమిషన్ చార్జీలను 8 నుంచి 15 శాతం మేర తగ్గించడం ద్వారా వాటికి గట్టి పోటీ ఇస్తామని ర్యాపిడో భావిస్తోం ది. అంటే రూ.400 విలువ చేసే ఆర్డర్ వరకు రూ.25 కమిషన్, అంతకు మించి ఉంటే రూ.50 చార్జీ వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎన్ ఆర్ ఏఐతో దేశ వ్యాప్తంగా సుమారు 5 లక్షలకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు అనుసంధానం అయి ఉన్నాయి.