India corona : ఆమెరికా తర్వాత భారత్ లోనే అత్యధిక కరోనా కేసులు..!

India corona : దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో... 3 లక్షల 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

Update: 2022-01-24 08:27 GMT
India corona : దేశంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో... 3 లక్షల 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనాతో 439 మంది మృతి చెందారు. దీంతో కలపి మొత్తం మృతుల సంఖ్య 4 లక్షల 89 వేల 848కి చేరింది. అటు... యాక్టివ్‌ కేసుల సంఖ్య 22 లక్షల 49 వేల 335 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారి పాజిటివిటీ రేటు 20.75 శాతానికి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.95 కోట్ల కేసులు నమోదు కాగా.... అమెరికా తర్వాత అత్యధిక కేసులు మనదేశంలో నమోదయ్యాయి.

Tags:    

Similar News