దేశంలో కొత్తగా 3,57,229 కరోనా కేసులు.. 3,449 మంది మృతి..!

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది.

Update: 2021-05-04 04:48 GMT

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అయితే, మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది. అయినా సరే ఇంకా ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. గడిచిన 24 గంటల్లో 3 లక్షల 57వేల 229 కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కరోనా కేసులు తగ్గినా సరే మరణాల సంఖ్యలో మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3449 మంది చనిపోయారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2 లక్షల 22వేల 408కి చేరింది. మరోవైపు దేశంలో ఇప్పటి వకకు కరోనా సోకిన వారి సంఖ్య రెండు కోట్లను దాటింది. భారత్‌లో ఇప్పటి వరకు 2 కోట్ల 2 లక్షల 82వేల మందికి పైగా కరోనా సోకింది. దేశంలో ప్రస్తుతం 34 లక్షల 47వేల 133 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News