India corona cases : దేశంలో కొత్తగా 4,14,188 కరోనా కేసులు... 3,915 మంది మృతి!

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 కరోనా టెస్టులు చేయగా 4,14,188మందికి కరోనా సోకింది.

Update: 2021-05-07 04:48 GMT

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,26,490 కరోనా టెస్టులు చేయగా 4,14,188మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 3,915మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,14,91,598కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనాతో 2,34,083మంది చనిపోయారు. గత 24 గంటల్లో 3,31,507మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1,76,12,351మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,45,164 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News