ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేంద్రమంత్రి అమిత్ షా

కేంద్రమంత్రి అమిత్ షా ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల శ్వాస సంబంధ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం

Update: 2020-09-17 14:28 GMT

కేంద్రమంత్రి అమిత్ షా ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల శ్వాస సంబంధ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అమిత్ షా వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఆగష్టు 2 కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొంది కోలుకున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న తరువాత రెండు సార్లు మళ్లీ ఆస్పత్రిలో చేరారు. కరోనాకు ముందు కుడా అమిత్ షా పలు సార్లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కాగా, ఆయన ఆస్పత్రి నుంచి విధులు నిర్వహించారు.

Tags:    

Similar News