ఆర్మీ స్కూల్లో ఉద్యోగాలు.. 8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబరు 20. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.;
దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో 8వేల టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందుకోసం నిర్వహించే ప్రాథమిక పరీక్ష తేదీని ఖరారు చేశారు. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. వీటిలో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ అక్టోబరు 20. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.
గమనిక: పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సంబంధిత పాఠశాలలు విడుదల చేసే ప్రకటనను అనుసరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలలు తదుపరి నియామక ప్రక్రియ (ఇంటర్వ్యూ, బోధనా నైపుణ్యాల పరిశీలన, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ) ద్వారా ఖాళీలను భర్తీ చేస్తాయి. సాధారణంగా నవంబరు-మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 8000
పోస్టులు: టీజీటీ, పీజీటీ, పీఆర్టీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. సీటెట్/ఆయా రాష్ట్రాల టెట్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఐదేళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వారికి గిరష్ట వయోపరిమితి 57 ఏళ్లు.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ: నవంబరు 21,22 తేదీల్లో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2020
అభ్యర్థులు పూర్తి వివరాలకు http://aps-csb.in/ వెబ్సైట్ చూడొచ్చు.