Madhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
Madhya Pradesh: మధ్య ప్రదేశ్ చింద్వారాలో బిచ్చగాడు భార్య కోసం రూ. 90,000 విలువైన మోపెడ్ని కొనుగోలు చేశాడు.;
Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు చెందిన ఓ బిచ్చగాడు తన భార్యకు కానుకగా రూ.90,000 విలువైన మోపెడ్ను కొనుగోలు చేయడం వైరల్గా మారింది.
సంతోష్ సాహు అనే వ్యక్తి వికలాంగుడు కావడంతో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. కాళ్లు కదలకపోవడంతో ట్రై సైకిల్పై కూర్చుని భార్య మున్నీ సాహుతో కలిసి భిక్షాటన చేసేవాడు. సంతోష్ ట్రై సైకిల్పై కూర్చునేవాడు, మున్నీ ట్రైసైకిల్ని ముందుకు తోస్తూ భిక్షాటన చేసేవారు.
అయితే, అధ్వాన్నమైన రోడ్లు, విపరీతమైన ఎండలు కారణంగా భిక్షాటన సమయంలో దంపతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భార్య అనారోగ్యంతో మూలపడితే రోజులు ఎలా గడుస్తాయని ఆలోచించాడు.. ఆమె ఆరోగ్యం క్షీణించకముందే ఆమె కోసం మోపెడ్ను బహుమతిగా కొనాలని నిర్ణయించుకున్నాడు.
అయితే మోపెడ్ కొనేంత డబ్బు తన వద్ద లేదు. వారి సంపాదన సాధారణంగా రూ. రోజూ 300 నుంచి 400 వరకు ఉండేది. బస్టాండ్లు, దేవాలయాలు, మసీదుల్లో భిక్షాటన చేస్తూ సాహు నెమ్మదిగా డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. 4 సంవత్సరాల వ్యవధిలో రూ. 90,000 సేకరించాడు. మోపెడ్ కొనడానికి సరిపడా డబ్బు సమకూర్చుకున్నాడు. చివరకు నగదు చెల్లించి వాహనం కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే మోపెడ్పై భిక్ష్టాటనకు వెళుతున్నారు.
తన భార్య కోసం సాహు చేసిన ఆలోచనకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ప్రేమకు నిజమైన నిర్వచనం ఇది అని సాహూని ప్రశంసిస్తున్నారు.