కేరళ రాష్ట్ర బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్

కేరళలో ఎర్రజెండాను దించి కాషాయజెండా ఎగురవేయాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది కమలం పార్టీ.

Update: 2021-03-04 14:00 GMT

కామ్రెడ్ కంచుకోటను వచ్చే ఎన్నికల్లో బద్దలు కొట్టాలని మోడీషా ద్వయం వ్యూహాలు రచిస్తోంది. కేరళలో ఎర్రజెండాను దించి కాషాయజెండా ఎగురవేయాలని పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది కమలం పార్టీ. అందులో భాగంగా గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తోంది. ఇక కేరళ అధికార పీఠంపై గురిపెట్టిన బీజేపీ... అందరికంటే ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ను కేరళ సీఎం అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రోమ్యాన్ శ్రీధరన్ ఇటీవలేబ బీజేపీలో చేరారు. పార్టీలో చేరక ముందే తనకు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అని శ్రీధరన్ ప్రకటించారు. మరోవైపు ఈరోజుతో తాను పదవీ విరమణ చేస్తానని తెలిపిన ఆయన.. త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అయితే శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ పార్టీకి బాగా కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

Tags:    

Similar News