కోవిడ్ కర్ప్యూ మళ్లీ మొదలైంది

Update: 2020-11-20 04:46 GMT

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సహా యూరోప్ లోని పలుదేశాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కఠిన ఆంక్షలు కూడా పెడుతున్నాయి కంట్రీస్. ఇప్పటిదాకా అక్కడి గురించే మాట్లాడాం..కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ షాక్ ఇండియాలో కూడా మొదలైంది. గుజరాత్ ఆర్ధిక నగరం అహ్మదాబాద్ లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి 9గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ అహ్మదాబాద్ నగరంలో కర్ప్యూ అమల్లో ఉంటుంది. గుజరాత్ తో మళ్లీ 1281 కోవిడ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. పరిస్థితి మళ్లీ చేజారి పోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు రాత్రి పూట ఆంక్షలు పెట్టారు.

Tags:    

Similar News