Corona Update: ఊపిరి పీల్చుకుంటున్న భారత్.. తగ్గుతున్న పాజిటివిటీ రేటు
సోమవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లోభారత్ 1.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులనునమోదు చేసింది.;
Corona Update: సోమవారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన డేటా ప్రకారం గడిచిన 24 గంటల్లోభారత్ 1.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులనునమోదు చేసింది. దేశంలోని ఇప్పటి వరకు రికార్డైన మొత్తం ఇన్ఫెక్షన్లు 2.80 కోట్లకు పైనే. ఏప్రిల్ 9 నుండి రోజువారీ ఇన్ఫెక్షన్లలో ఇది అతి తక్కువ సంఖ్య.
వీటిలో, క్రియాశీల కేసులు 20 లక్షలకు పైగా తగ్గాయి మరియు రికవరీల సంఖ్య 2.56 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ 26 నుండి చూస్తే అత్యల్పంగా నిన్న నమోదైన మరణాల సంఖ్య 3,128 ఇప్పటి వరకు నమోదైన మరణాలు 3.29 లక్షలకు పైగా ఉంది.
కోవిషీల్డ్ మొదటి డోసు రెండవ డోసు మధ్య విరామాన్ని పొడిగిస్తే కలిగే ప్రభావాన్ని కూడా ప్రభుత్వం సమీక్షిస్తుంది. తమిళనాడు 28,864 కేసులతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర వరుసగా రెండవ రోజు 20,000 కన్నా తక్కువ
మోదీ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాల పదవీకాలం పూర్తి కావడంతో మహమ్మారితో పోరాడుతూ, కోవిడ్ -19 కు తల్లిదండ్రులు, బతికున్న తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరికీ పిఎం-కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం లభిస్తుందని మోడీ ప్రభుత్వం శనివారం తెలిపింది.
మరో కీలక నిర్ణయంలో, కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి రిజిస్టర్డ్ డిపెండెంట్లందరికీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పథకం కింద పెన్షన్ కవరేజీని ప్రభుత్వం విస్తరించింది.