భారత్లో కొత్తగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు
భారత్లో కొత్తగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవున్నాయి. ఆదివారం అత్యధికంగా 79 వేల కేసులు నమోదు కాగా... సోమవారం కొత్తగా 78,512 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 36 లక్షల 21 వేలు దాటింది. అలాగే గడిచిన 24 గంటల్లో 971 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 60,868 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.